Thursday, May 20, 2010

తూర్పు కనుమలు - 2 : స్నేహితుడి సేవ

తూర్పు కనుమలు - 2

స్నేహితుడి సేవ

సమయం: ఉదయం 9:00
ప్రాంతం: గోకవరం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, తూ.గో జిల్లా

ఆ రోజు చల్లగా ఉంది, రవికి ఏదో తెలియని ఆనందం, నెల రోజుల తర్వాత మళ్ళీ తను శ్రావ్యని చూడబోతున్నాడు, ఆమె అంటె రవికి చాల ఇష్టం, అభిమానం, కాని ఇప్పటివరకు తనతో ఒక్క మాట కూడ మాట్లాడలేదు, అలా నడుస్తూ వస్తున్న శ్రావ్య కేసి చూస్తూ గాల్లొ తేలిపోతున్నాడు రవి, ఇంతలో ఎవరో ఇద్దరు చేతులు పట్టుకు లాగాడంతో భూమ్మిదకి వచ్చడు. వాళ్ళిద్దరు రవి స్నేహితులు, ఒకడు టిల్లు మరొకడు, శ్యాం, ఇద్దరు కలిసి రవిని ఆటపట్టించసాగారు. ఇలా కొంతకాలం గడిచింది, ఒక రోజు టిల్లు శ్రావ్య తో మాట్లాడుతూ రవి కేసి చూపించాడూ, శ్రవ్య రవికేసి చూసి ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోయింది,కొన్ని రోజులు గడిచాక రవి శ్రావ్య దెగ్గరికి వెళ్ళీ తన ప్రేమ విషయం చెప్పాడు, ఆమె ఆష్చర్యంగా మొహం పెట్టి, తను టిల్లూని ప్రేమిస్తున్నాను అని చెప్పింది, రవి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు, తని ఇన్నాళ్ళూ తన ప్రేమకు సాయం చేయమంటే టిల్లు మొత్తానికే మోసం చేశాడు, కాదు కాదు తన చేతకానితనాన్ని అతను అనుకూలముగా మలచుకున్నాడు. శ్యాం కూడా టిల్లూకి సహాయం చేశాడు, రవిని ఒక పావులా వాడుకున్నారు, కాని రవి మనసు గాయపడింది, ఒకటి శ్రావ్య తిరస్కరించినందుకు, రెండు స్నేహితులే తనని మోసం చేసినందుకు, తట్టుకోలేకపోయాడు, కొన్నాళ్ళు కళాశలకి రావడం మానేశాడు, వూరి చివర కొండల్లో, గుట్టల్లో పిచ్చివాడిలా తిరిగాడు.

ఒకరోజు జోరున వాన కురుస్తుంది, కొండలలో తిరుగుతూ తడుస్తూ వాగు వొడ్డుకు చేరుకున్నాడూ రవి, అక్కడ బల్లకట్టు గోకవరానికి వెల్లడానికి సిద్దంగా ఉంది, అప్పటికే దానిపై చాళా మంది ఉన్నారు, రవి ఎక్కాక బల్లకట్టు బైలుదేరింది, ఇంతలో వాగు పొంగింది, బల్లకట్ట పై బరువు పెరగడంతో మునిగిపోయి కొట్టూకుపోయేటట్టు ఉంది, వాగు ఉధ్రుతంగా ఉండడంతో ఎవారూ దూకడానికి ధైర్యం చేయలేడు పైగా చాళ మంది ఆడవాళ్ళు ఉన్నారు ,ఒకరు దిగితే కాని బల్లకట్టూ అదుపులోకి రాదు, రవి, ఒక ముసలాయన, ఒక చిన్న కుర్రాడు తప్ప మిగితావారంత పని కోసం వచ్చిన కూలి మహిళలే, బల్లకట్ట కొట్టుకుపోయెట్టత్తు ఉంది, నా జీవితం ఎలాగో వ్యర్ధం నేను దూకేస్తాను అనుకుని రవి దూకబోయాడు, అతని చేతిని ముసలి తాత పట్టుకుని ఆపి, " నీకేమైనా పిచ్చా బ్రతికి సాధించు, ఇంకా బోలెడు జీవితముంది కదా, ఎవరూలేని నేను మీకోసం ఇక్కడికి వచ్చానేమో, నేను దూకుతాను, పోయినా పర్లేదు, మీరు క్షేమంగా వొడ్డుకు రండి" అని రవిని వెన్నక్కి నెట్టి అతను దూకేశాడు, బల్లకట్టు నెమ్మదిగా అదుపులోకి వచ్చింది, అందరు వొడ్డుకు చేరారు, ఆ ముసలి తాత ఇంక వాగులోనే ఉన్నడు, రవి వొడ్డు వెంబడి వెళ్ళాడు, చీకటి పడింది, తాత జాడ లేదు.

రవి ఆలొచనలో పడ్డడు, తన ఆవేదనని సంకల్పముగా మలచుకున్నాడు, కొన్నాళ్ళకు దేశంలోనె ఒక పెద్ద శాశ్త్రవేత్తగా అవతరించాడు. తన సొంత వూరు గోకవరానికి వచ్చాడు, అతనికి అపూర్వ స్వాగతం లభించింది, కాని రవి వినకూడని వార్త ఒకటి విన్నాడు, టిల్లూకి శ్రావ్యకి పెళ్ళి జరిగిన రోజునే, టిల్లూని కొందరు సంఘవిద్రోహ శక్తులు కాల్చి చంపారని, ఆ సంఘటన వల్ల శ్రావ్య పిచ్చిదైపోయిందని. ఒక్కసారి కళ్ళలో నీళ్ళు తిరిగాయి రవికి, శ్యాం గుండె జబ్బుతో మరణించాడాని తెలిసి ఇంకా భాదపడ్డాడు. శ్రావ్యని అక్కడి నుండి తీసుకువెళ్ళి ముంబైలో చికిత్స చేయించాడు, తను తిరిగి మాములు మనిషి అయ్యే దాక కంటికి రెప్పలా చూసుకున్నాడు రవి, ఎందుకు ఇదంతా అని ఎవరైనా అడిగితే, "నా స్నేహితుడి కోసం నేను చేస్తున్న సేవ" అని చెప్పెవాడు రవి.

Wednesday, May 19, 2010

నేను తీసిన ఫోటోలలో నాకు నచ్చినవి -6

ఫోటోలు తీయడం అంటే నాకు భలే సరదా,
నేను తీసిన ఫోటోలలో నాకు నచ్చినవి కొన్ని ఇక్కడ టపాలో పెడుతున్నాను..
ఇందులో గ్రాఫిక్స్ లేవు అన్ని mobile తో తీసినవే!





Monday, May 17, 2010

తూర్పు కనుమలు - 1 : ఎవరికి కాని వాళ్ళు?

తూర్పు కనుమలు:

భారత దేశ భౌగోలిక పటంలో అతి పురాతన కొండలు తూర్పుకనుమలు, ఇవి మధ్య మధ్యలొ పీటభూమి కలిగి ఉంటాయి, మన రాష్టృంలో చాలా ప్రాంతాలు ఈ కనుమలతో అనుసంధానమై ఉన్నాయి. ఈ తూర్పుకనుమల ప్రాంతాల్లోని కొన్ని జీవన చిత్రాలకు, సంఘటనలకు నా సృజన కొంత జోడించి ఒక కథా సంకలనాన్ని మీ ముందు ఉంచుతున్నాను, అవే నా " తూర్పు కనుమలు". ఒకొ టపాకి ఒకో కథ.

ఎవరికి కాని వాళ్ళు?

సమయం: సాయంత్రం 5:00
ప్రాంతం: విశాఖపట్నం రైల్వే స్టేషన్

వేసవి సెలువల రద్దీతో రైల్వే స్టేషన్ కిటకిటలాడుతోంది, హౌరా నుండి వచ్చిన ఒక రైలులోంచి ఒక నడివయ్స్కుడు దిగాడు అతను చుట్టూ కలియచూశాడు తర్వాత మెల్లిగా బైటకి వెల్లడానికి పాదచారుల వంతెన, ఎక్కుతున్నాడు, అక్కదంతా యాచకులు ఉన్నారు, అతను ఒక ముసలావిడ వద్దకు వెళ్ళాడు, ఆవిడ చేతిలొ 10 రూపయిలు ఉంచి, "మీరు ఎక్కడుంటారమ్మ?" అని అడిగాడు, "నా లోకం ఇదే బాబు, రాత్రికి ఇంత తిని ఇక్కడే పడుకుంట, నాకు ఎవరూ లేరయ్యా" అని దీనంగా చెప్పిండావిడ. ఆవిడ పేరు కనుక్కుని అతను మరొకరి దెగ్గరికి వెల్లాడు, అతనికి ఒక కాలు పై దెబ్బ తగిలి పుదయింది, అది చుపించి దయ తలచమని యాచిస్తున్నాదు, "ఎమైంది?" అని అడిగాడు అతను, రైల్లొచి పడిపోవడంతో ఇల అయిందని, వెన్నుముక పాడైందని, తను ఇలా ఇక్కడే ఆనుకుని ఉంటున్నానని చెప్పాడు, అవటి వాన్నని, భార్య ఇంకెవరితోనో వెల్లిపోయిందని, తను ఎవరు లేక ఇలా వచ్చేశానని చెప్పాడు.

ఇలా అతను ముందుకు వెళ్ళేకొద్దీ యెన్నో గాథలు విన్నాడు, సాంతం ఆలకించాడు, కొందరు పొమ్మని తిట్టారు, కొందరు వారి భాదను చెప్పుకున్నారు, కొందరు ఎమి అనలేక అలా ఉండిపోయారు. అలా అతను రాత్రి 7 గంటల తర్వాత రైల్వే స్టేషన్ నుండి బైటకి వచ్చి ఒక ఆటో ఎక్కాడు, వెంటనే ఒక చిన్న పిల్ల ఒక చంటి పిల్లాడిని సంకన ఎత్తుకోలేక ఎత్తుకుని దానం చేయమని సైగ చేసింది, ఆమెకి 5 రూపాయలు ఇచ్చి, వివరాలు అడగడానికి ప్రయత్నించాడు కాని ఆ పిల్లి జడుసుకుని భయంగా పారిపోయింది. ఆటొ బైల్దేరింది అలా మైన్ రొడ్డెక్కింది. ఆటోలోంచి పరిసరాలని చూస్తు అతను తీవ్రంగా ఆలొచిస్తున్నాడు.

సమయం సాయంత్రం 5:00 ( 3 రోజుల తర్వాత)
ప్రాంతం: విశాఖపట్నం రైల్వే స్టేషన్

కొందరు హడావిడిగా ఈ యాచకుల వద్దకు వచ్చి కొందరి పేర్లు కన్నుక్కుని వాళ్ళని అక్కడినుండి తీసుకువెళ్ళారు, కొందరిని 108లో ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. కొందరిని స్వయం సహాయక మరియూ ప్రభుత్వ పునరావాస కేంద్రాళకు తీసుకువెళ్ళారు, అందరూ ఆశ్చర్య పోయారు, ప్రభుత్వంవాళ్ళు వచ్చి వాళ్ళని పునరావాస కేంద్రాలకు తీసుకువెల్లడమేంటని!

మరుసటి రోజు ఉదయం ఒక ప్రభుత్వ వాహనం ఒక పునరావాస కేంద్రానికి వచ్చింది, అందులోంచి నీటుగ అధికార ధర్పం ఉన్న ఒక వ్యక్తి బైటకి వచ్చారు, అలా నడుచుకుంటు వెళ్ళి ఒక ముసలావిడ దెగ్గరికి వెళ్ళీ ఆవిడని ఆప్యాయంగా పేరుతో పిలిచారు, ఆమె అనురాగవర్షిత నేత్రాలతో అతని చూసి ఆశ్చర్యపోయింది, అతను ఎవరో కాదు, స్వయానా ఆ జిల్లా కలెక్టరు, 3 రోజుల క్రితం రైల్వే స్టేషన్లో తనను పలకరించిన సాదాసీదా నడివయస్కుడు.

ఆక్కడ పరిస్తితులని తెలుసుకుని వారిలో యొగ్యులకి స్వయం ఉపాధి చూపించే ప్రయత్నం చేసాడు ఆ కలేక్టర్, తన వంతు ధర్మం నెరవేర్చడానికి ప్రయత్నించాడు, సఫలీకృతుడయ్యాడు. కొన్నాల్ల తర్వాత రైల్వే స్టేషన్లో యాచించుకునే వాళ్ళే అక్కడ గౌరవంగా తమ పని చేసుకుంటున్నారు! ఎవరికీ కాని వాళ్ళు!!

LinkWithin

Related Posts with Thumbnails