Tuesday, November 10, 2009

సాయం అందుతోందా?

ఇటీవలి కాలంలో మన రాష్త్రంలో సంభవించిన వరదల నుండి ప్రజలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు.ప్రభుత్వం మరియు అనేక సంస్థలు ఆపన్నహస్తాలు అందించారు. అయినా చేసిన సాయం బాధితులకి అందుతోందా?
ఎందుకంటే నేను ఈ మధ్య ఒక సంఘటన చూసాను, గుంటూరు జిల్ల మంగళగిరి bus stand లొ ఒక ముసలావిడ యాచిస్తుంది.అందరి దెగ్గరికి వెళ్లట్లేదు, సంసయిస్తూ తిరుగుతూ యాచిస్తొంది ఆవిడ. కాసేపు గమనించి ఆవిడని పలకరించాను, అప్పుడు చెప్పింది వాల్ల వూరిలొ పెంకుటిల్లు వరదకి కూలిపోయిందని, కన్నబిడ్డలు వదిలేసి వెల్లిపోయారని, తన భర్త అనారోగ్యం తో మంచాన ఉన్నాడని, వరదల్లొ అన్నీ కోల్పోయామని చెప్పింది.
ప్రభుత్వం వారు సాయం అందిస్తున్నరు కద మరి ఇలా ఎందుకు అని అడిగాను నేను, సాయం అడిగితే రెషన్ కార్డు లేకుండా ఏమీ ఇవ్వలేము అని చేతులు ఎత్తేశారంట, వరదల్లో అన్నీ పోయిన వాళ్ల దెగ్గర కార్దులు ఎలా ఉంటాయి అనుకుంటున్నారొ తెలీదు.ప్రభుత్వం వరద నివారణ చర్యలు, సహాయక చర్యలు బానే చేపట్టింది, కాని వ్యవస్థ లోని చిన్న చిన్న లోపాలు, ఆ సాయం అందకుందా చేస్తున్నాయి.ఆ ముసలావిడను వెంట తీసుకెళ్లి కొంత బియ్యం, కొన్ని పండ్లు కొనిచ్హాను, నేను శాశ్వత పరిష్కారం చూపించలేక పోవచ్చు కానీ ఆవిడకి చేయగలిగింది చేసాను, ఇలా మన చుట్టు ఇంకెంతమంది ఉన్నారో మనకి తేలీదు.
అసలైన భాధితులకి సాయం అందుతోందా అనేది ఇక్కడ ప్రశ్న గానే మిగిలిపోయింది చివరికి?

2 comments:

శివ చెరువు said...

yes...crores of rupees were collected.. every time we see only great advertisements for donations... no where i did see some info how they utilized the same...

పరిమళం said...

ప్చ్ ...........

LinkWithin

Related Posts with Thumbnails